nomula bagath is fixed?
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత శాసనసభ్యుడు (సిట్టింగ్ ఎమ్మెల్యే) నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ బరిలో దిగనున్నారు. ఈమేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ టికెట్ ను ఆశిస్తున్న కోటిరెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపు అందిందని సమాచారం. తనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఆయన ఇప్పటికే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారని తెలిసింది. కోటిరెడ్డి బీజేపీలో చేరతాడాని ప్రచారం జరుగుతున్న సమయంలో సీఎంతో భేటీకి ప్రాధాన్యం పెరిగింది.