పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం. ఈరోజు(అక్టోబరు 13 వ తేదీన) ఉదయం 06.30 – 07.30 గంటల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో కాకినాడ కు దగ్గరలో( Lat.17.0 deg.N మరియు Long. 82.4 deg.N) తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 55 km నుండి 65 km గరిష్టంగా 75 km వేగంతో గాలులు వీచాయి. ప్రస్తుతం తుఫాను ప్రభావం కొనసాగుతుండగానే మరో అల్పపీడనం ఏర్పడింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బుధవారం ఏర్పడే అవకాశాలున్నాయి. దాని ప్రభావం ఎలా ఉంటుందనేది రెండురోజుల తరవాతే తెలుస్తుందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ తెలియజేసింది.