సీఎం సహాయ నిధికి ₹24 లక్షల చెక్ అందజేసిన ఆంధ్రప్రదేశ్ హైర్ బస్సు ఓనర్ అసోసియేషన్ సభ్యుల
రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకి అందజేత
అమరావతి, సెప్టెంబరు,18.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైర్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ₹24 లక్షల చెక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి అందజేశారు.
వరద బాధితులకు సహాయం కోసం మరింత మంది ముందుకొచ్చి సహాయం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.