తెలంగాణ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన అసలేం జరిగింది చిత్రంలో శ్రీరామ్, సంచితా పడుకునే జంటగా నటిస్తున్నారు. ఎన్వీఆర్ దర్శకత్వంలో ఎక్స్డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 1970- 80 ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది. పూర్తి కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్లో విడుదల చేయాలని అనుకున్నాం. ఈ నెల 22న రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు.