బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సీఎం కేసీఆర్ కు ఆహ్వానపత్రం

హైదరాబాద్: జూలై 5 వ తేదీ నుంచి జరుగనున్న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానము అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానిస్తూ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కలిసి ఆహ్వాన పత్రికను అందచేసారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ కు ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సహా ధర్మకర్త మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article