హైదరాబాద్:నగరంలో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి కళ్యాణాన్ని మంత్రులు కుటుంబ సమేతంగా తిలకించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం
Balkampeta yellamma Kalyanotsavam
