- 15 రకాల లాంథనైడ్స్తో పాటు స్కాండియం, వైట్రియం గుర్తింపు
- ఖనిజాల అన్వేషణకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని అనుమతి కోరిన రాష్ట్ర గనులశాఖ
తెలంగాణలో అరుదైన ఖనిజాల నిల్వలు వెలుగుచూశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోన్స్, కంప్యూటర్ హార్డ్డ్రైవ్ వంటి పరికరాల్లో ఉపయోగించే అరుదైన మూలకాల నిల్వలు ఉన్నట్లు బయటపడింది. మనోహరాబాద్- టు కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. 15 రకాల లాంథనైడ్స్తో పాటు స్కాండియం, వైట్రియం లాంటి ఖనిజాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు జీఎస్ఐ నివేదిక ఇచ్చింది.
దీంతో రాష్ట్ర గనులశాఖ ఈ ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. వైట్రియం ఖనిజం కిలో రూ.32వేలు విలువచేస్తుంది. రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఈ అరుదైన ఖనిజ సంపద ఉన్నట్లుగా రాష్ట్ర గనులశాఖ కేంద్రానికి నివేదిక పంపించింది. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే అనుమతులు ఇస్తే మరింత విలువైన ఖనిజ సంపద ఈ జిల్లాల్లో లభించవచ్చని రాష్ట్ర గనులశాఖ అధికారులు భావిస్తున్నారు.
ceriate, allanite, thorite, tantalite, columbite, apatite, monazite, zircon, pyrochlore, euxenite, and fluorite