CASE FILED ON BHANU PRIYA
సినీ నటి భానుప్రియ పై కేసు నమోదు కానుంది. ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బాలికలతో ఇంట్లో పని చేయించుకుంటున్న భానుప్రియపై ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ సీరియస్ అయ్యింది. భానుప్రియ ఇంట్లో పని చేసిన బాలిక వివరాలు సేకరించిన ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు గాంధీబాబు జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 370 కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో నటించి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటి భానుప్రియ చెన్నైలోని ఆమె నివాసంలో మరో ముగ్గురు మైనర్ బాలికలను అధికారులు గుర్తించారు. ఇటీవల ఓ చిన్నారిని వేధిస్తుందంటూ కనీసం తల్లిని కూడా కలిసేందుకు వీలు కల్పించట్లేదంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆ బాలికదే తప్పుందంటూ పోలీసులు సైతం తల్లి, కూతురుని అరెస్టు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే మైనర్ బాలికతో పని చేయించుకుంటుందని బాలల హక్కు సంఘం అధికారి అచ్యుతరావు.. భానుప్రియపై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి)కి ఫిర్యాదు చేశారు. భానుప్రియను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.
దాంతో పాటుగా భానుప్రియ ఇంట్లో నలుగురు మైనర్ బాలికలు ఉన్నారని.. కావాలంటే ఇన్వెస్టిగేట్ చేసుకోవాలని కోరారు. వారందరినీ సెక్స్ వర్క్లోకి దింపేందుకు నటి ప్రేరేపిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఒక మధ్య వ్యక్తిని పెట్టుకుని బాలికలను ఆంధ్ర నుంచి చెన్నైకు తీసుకుస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేర చెన్నైలోని టీ నగర్ నివాసంలో దాడులు చేసిన బాలల హక్కుల పరిరక్షణ సమితి అధికారులు ముగ్గురు మైనర్ బాలికలను గుర్తించారు. అంతకు ముందు భానుప్రియ నివాసంలో తన కూతురు వేధింపులకు గురవుతోందని.. తల్లి సామర్లకోటలో కొద్ది రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో దొంగిలించిన వస్తువులు తిరిగి అడిగినందుకే కేసు పెట్టారని..ఏడాది నుండి బాలిక పద్మ పనిచేస్తోందని…డబ్బు..ఇతర వస్తువులు కనిపించకపోవడంతో బాలికను నిలదీయడం జరిగిందని…పోలీసులకు చెబుతామని హెచ్చరించడం జరిగిందన్నారు. చివరకు బాలిక తన తప్పును ఒప్పుకుందని చెప్పిన భానుప్రియ తమపై చేసిన ఫిర్యాదు తప్పని చెప్పారు. అయితే మైనర్ బాలికతో పని చేయించుకుంటున్న వ్యవహారం లో ఆమె ఇరుక్కుపోయారు. ఇప్పుడు మరో ముగ్గురు మైనర్ లను ఆమె ఇంట్లో అధికారులు గుర్తించటంతో ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. దీంతో భానుప్రియ పై జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.