ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్‌గా చిరంజీవి

chirajnjeevi biggest fan of pawan kalyan

అన్న చాటు త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన క‌థానాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. త‌న‌కి న‌ట‌న‌పై అంత‌గా ఆస‌క్తి లేదని చెప్పినా…వ‌దిన సురేఖ‌,అన్న చిరంజీవి ప్రోద్భ‌లంతో ట్రైనింగ్ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.ఆ త‌ర్వాత ఒకొక్క సినిమాతో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్టైల్‌ని సృష్టించుకుని స్టార్‌గా ఎదిగాడు.ఆ త‌ర్వాత ప‌వ‌న్ అంటే ఓ ప్ర‌భంజ‌నంలా మారిపోయింది.దేశంలోనే  క‌ల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒక‌డిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి పేరుంది.ఈ విష‌యం గురించి చిరంజీవి ఇటీవ‌ల స్వ‌యంగా మాట్లాడుతూ అంద‌రి హీరోల‌కీ అభిమానులుంటే మా త‌మ్ముడికి భ‌క్తులు ఉన్నార‌ని చెప్పారంటే ప‌వ‌న్ మేనియా ఏ రేంజ్‌లో సాగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు.త‌న‌కంటూ అంత ఫాలోయింగ్ ఉన్న‌ప్ప‌టికీ అన్న చిరంజీవి అంటే ప‌వ‌న్‌కి ప్రాణం.త‌న తండ్రి స‌మానులు, గురు స‌మానులు అని చెబుతుంటారు.ఆయ‌న లేక‌పోతే నేను లేను అన్న‌ట్టుగా మాట్లాడుతుంటారు.అలాంటిది ఇప్పుడు వాళ్లిద్ద‌రి గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ప్ర‌చారంలో ఉంది.
`భోళాశంక‌ర్‌` సినిమాలో చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానిగా క‌నిపిస్తాడ‌నేది ఆ వార్త‌.అందులో నిజ‌మెంత‌న్న‌ది తేలాల్సి ఉంది. అయితే ఈ సినిమా గురించే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త ప్ర‌చారంలో ఉంది.ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఖుషి సినిమాలోని బొడ్డు సీన్‌ని భోళాశంక‌ర్‌లో చిరంజీవి చేసిన‌ట్టు స‌మాచారం. ఖుషిలో ఆ సీన్ ప‌వ‌న్‌కీ – భూమిక‌కీ మ‌ధ్య తెర‌కెక్కించ‌గా, భోళాశంక‌ర్ సినిమాలో చిరంజీవికీ, యాంక‌ర్ శ్రీముఖికీ మ‌ధ్య సాగుతుంద‌ని స‌మాచారం. కామెడీ సీన్స్‌లో భాగంగానే ఈ స‌న్నివేశాలు తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article