హైదరాబాద్:రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాగోతం బట్టబయలైంది. సీఐ నాగేశ్వరరావు ఓ వివాహితతో లాడ్జీలో రాసలీలలు ఆడుతూ ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయారు. తన భార్యను సీఐ లాడ్జీకి తీసుకెళ్లినట్లు తెలుసుకున్న మహిళ భర్త వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు లాడ్జీలో తనిఖీ చేయగా ప్రియురాలితో సహా సీఐ పట్టుబడ్డారు. తన భార్యతో అఫైర్ పెట్టుకోవడంతో పాటు ప్రశ్నించినందుకు సీఐ తనపై దాడికి పాల్పడ్డారని మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వనస్థలిపురం పోలీసులు ఆయనపై అత్యాచారం, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు సీఐని రిమాండ్కు తరలించనున్నట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.గతంలో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన నాగేశ్వరరావుకు గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ ఉంది. ఈ క్రమంలోనే తన టీమ్తో బంజారాహిల్స్లోని పుడింగ్ మింక్ పబ్లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి సంచలనం రేపారు. అయితే ఈ డ్రగ్స్ కేసులో విచారణ సరిగ్గా సాగడం లేదని భావించిన ఉన్నతాధికారులు బంజారాహిల్స్ సీఐగా శివచంద్రను బదిలీ చేసి ఆయన స్థానంలో నాగేశ్వరరావును కొత్త సీఐగా నియమించారు. జులై ఏడవ తారీఖు రాత్రి 12 గంటలకు ఇన్స్పెక్టర్ తనపై అత్యాచారం జరిపినట్లు బాధితురాలు ఆరోపించింది. అడ్డు వచ్చిన తన భర్త తల పగలగొట్టాడని ఆ తర్వాత తమ ఇద్దరినీ చంపేందుకు పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్తుండగా ఇబ్రహీంపట్నంలో కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో తమ ప్రాణాలు దక్కాయని బాధితురాలు ఫిర్యాదు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. బంజారా హిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో ఎంపీ టీజీ వెంకటేష్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చేందుకు 25 లక్షలు లంచం తీసుకున్నట్లు నాగేశ్వరరావు పై ఆరోపణలు ఉన్నాయి.ఆ కేసు విచారణలో ఎంతో పేరు తెచ్చుకున్న నాగేశ్వరరావు అక్రమ సంబంధం కొనసాగిస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడటం కలకలం రేపుతోంది.