సీఎం ఢిల్లీ పర్యటన రెండు రోజుల పొడిగింపు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ తోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చ జరుపుతారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధాని మోడీతో చర్చిస్తారు. రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతారు