Friday, September 20, 2024

బాధితుడికి బాసటగా సీఎం సహాయ నిధి.. రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 

* బాధితుడికి బాసటగా సీఎం సహాయ నిధి.. రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 
* ₹2,00,000/- లక్షల రూపాయల ఏల్వోసి పత్రాన్ని అందజేసిన మంత్రి 
విజయవాడ,సెప్టెంబరు,19 : పెండ్లిమర్రి లోని గంగనాపల్లికి చెందిన దాసరి శివాన్ష్ కు ₹2,00,000/- సీఎం సహాయనిధి అందింది. శివాన్ష్ పేగు సంబంధిత సమస్యతో అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తమ దీనస్థితిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ మంజూరు అయింది. బాధితులకు బాసటగా సీఎం సహాయనిధి నిలుస్తుందని మంత్రి తెలిపారు. అందుకు సంబంధించిన ఎల్వోసి మంజూరు పత్రాన్ని గురువారం స్వయంగా మంత్రి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బాధితుడి తండ్రి చంద్రశేఖర్ కి అందజేశారు. కాగా తమ కుమారుడి వైద్య సేవలకు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేసిన మంత్రికి బాధితుడి తండ్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular