రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి యెడల నిరసన తెలిపేందుకు ఇది ఉత్తమమైన మార్గంగా భావించి.. నేను నా నిరసన ప్రధానమంత్రికి నిరసనను ఈ బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించి కారణాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశానికి స్వాతంత్య్రం రావాలని పోరాటం జరిగే రోజుల్లో.. ఒకానొక సందర్భంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కాంగ్రెస్‌కు సారథ్యం వహించే సమయం నుంచి.. దేశానికి స్వాతంత్య్రం వస్తే ఏం చేయాలి.. ఈ దేశాన్ని ఎట్లా ముందుకుపోవాలి.. దేశంలో ఏం జరగాలి? అనే చర్చలు స్వాతంత్య్రానికి రావడానికి పూర్వమే జరిగాయి. ద గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా దాదాబాయ్‌ నౌరోజీ ఆయన కూడా దాంట్లో భాగస్వామ్యం వహించి అనేక చర్చోపచర్చలు జరిపారు. ఎందుకంటే స్వాతంత్య్రం రావడానికి పూర్వం కొంతమంది.. మనకు ఇప్పుడే స్వాతంత్య్రం అవసరం లేదు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article