హైకోర్టులో పిటిషన్ వేసిన కేసీఆర్
తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టును మాజీ సీఎం కేసీఆర్ ఆశ్రయిచారు. ఈ మేరకు సోమవారం కోర్టులో ఆయన పిటిషన్ దాఖాలు చేశారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ఈ కేసులో 15వ నిందితుడిగా చేర్చారని ఆయన పేర్కొన్నారు.
తాను రైల్ రోకోలో పాల్గొనలేదని ఆయన వెల్లడించారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మంగళవారం నాడు హైకోర్టులో జరగనుంది.