KCR to join dinner with Trump at Rashtrapathi Bhavan
తెలంగాణ సీఎం కేసీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విందుకు కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈవిందులో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ 25న ఢిల్లీ వెళ్లనున్నారు.ఈనెల 25న రాష్ట్రపతి భవన్లో అమెరికా అక్ష్యక్షుడు ట్రంప్ గౌరవారర్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరుకావాలని కేసీఆర్తో పాటు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ఆహ్వానం పంపారు. ట్రంప్తో విందుకు ప్రధాని మోదీతో పాటు మొత్తం 95 మందికి రాష్ట్రపతి కోవింద్ ఆహ్వానం పంపినట్లు సమాచారం.