రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘రాజీవ్’ను తీసేసి హాకీకి వన్నె తెచ్చిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరును చేర్చారు. ఇక నుంచి క్రీడల్లో అత్యున్నత అవార్డును ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరు పెట్టాల్సిందిగా తనకు ఎప్పట్నుంచో విజ్ఞప్తులు వస్తున్నాయని మోదీ చెప్పారు. వారు వెల్లడించిన అభిప్రాయాలకు ధన్యావాదాలు చెప్పారు. ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరును పెట్టామన్నారు