నేను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించను అని జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల వల్ల తనకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. సంక్రాంతి తరువాత సోనియాగాంధీ- రాహుల్ గాంధీ ని కలుస్తానని తెలిపారు. ఢిల్లీ కాంగ్రేస్ అధిష్టానంతో కలిసిన తరువాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. తన నోటికి సోనియా- రాహుల్ తప్ప ఎవరూ తాళం వేయలేరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలే కాదని ఇతర పార్టీల్లో కూడా తన నోటికి తాళం వేసే దమ్ము ఎవరికి లేదన్నారు.