కోర్టుకెళ్తాం అంటున్న అనర్హత వేటు పడిన ఎమ్మెల్సీలు

MLC’S were Going to court

పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ అనర్హత వేటు వేశారు. ఇక తమపై వేటు వేసిన శాసనమండలి చైర్మన్ పై భూపతి రెడ్డి ఫైర్ అయ్యారు. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసిన తర్వాత పార్టీ ఫిరాయింపు ఎక్కడిది అంటూ స్వామి గౌడ్ ని ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్వామిగౌడ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇక దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని భూపతిరెడ్డి తెలియజేశారు.
పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో తనపై శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్‌ నేత భూపతిరెడ్డి మండిపడ్డారు. ఇది రాష్ట్రంలోనే చీకటి రోజు అని, ముగ్గురి మీద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించడం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని ఆయన ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్‌ రెడ్డిలను అనర్హలుగా మండలి చైర్మన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భూపతి రెడ్డి బుధవారంనాడు స్పందించారు.
తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, తాను ఏ పార్టీ గుర్తు మీద కూడా గెలువలేదని, గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదని, తనపై ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాసలో విలీనం అయినట్లు గెజిట్ కూడా విడుదల చేశారని అంటూ అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
ఏ ప్రాతిపదికన తనపై అనర్హత వేటు వేశారని ఆయన అడిగారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిరాయింపు కేసు వేశామని, కానీ దానిపై చర్యలు తీసుకోలేదని, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఎన్నుకుంటేనే కదా మండలి చైర్మన్ అయ్యారని ఆయన అన్నారు.
పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని భూపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కోర్టుకు వెళతానని, న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం తోనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ తరహా చర్యలతో ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి మారిన ఎమ్మెల్సీలపై ఎలాంటి చర్యలు లేవు కానీ టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చినంత మాత్రాన తమపై చర్యలు ఎలా ఉంటాయంటూ అసహనం వ్యక్తం చేస్తున్న అనర్హత వేటు పడిన ఎమ్మెల్సీలు ఈ వ్యవహారంపై కోర్టుకెళ్తాం అంటున్నారు. మండలి చైర్మన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article