Friday, September 20, 2024

నెల్లూరులో వైసీపీ ఖాళీ

* నెల్లూరులో వైసీపీ ఖాళీ
* టీడీపీలో చేరిన 15 మంది కార్పోరేటర్లు, నుడా మాజీ ఛైర్మన్
* వీరితో పాటు టీడీపీలో చేరిన 50 మంది వైసీపీ నేతలు
* పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్
అమరావతిః నెల్లూరు పట్టణంలో వైసీపీ ఖాళీ అయింది. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో 15 మంది కార్పోరేటర్లు, ఓ కో-ఆప్షన్ సభ్యుడితో పాటు నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, 50 మంది వరకు వైసీపీ నేతలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. 3వ వార్డు కార్పోరేటర్ సంక్రాంతి అశ్విని, 4వ వార్డు కార్పోరేటర్ పి.ప్రత్యూష, 5వ వార్డు కార్పోరేటర్ ఓ.రవిచంద్ర, 6వ వార్డు కార్పోరేటర్ ఎమ్.మస్తానమ్మ, 9వ వార్డు కార్పోరేటర్ దామవరపు రాజశేఖర్, 10వ వార్డు కార్పోరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్, 11వ వార్డు కార్పోరేటర్ గోతం అరుణ, 14వ వార్డు కార్పోరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, 15వ వార్డు కార్పోరేటర్  జి.వెంకటేశ్వర్ రెడ్డి, 16వ వార్డు కార్పోరేటర్ వి.శ్రీకాంత్ రెడ్డి, 47వ వార్డు కార్పోరేటర్ పొట్లూరు రామకృష్ణ, 48వ వార్డు కార్పోరేటర్ షేక్ ఇంతియాజ్, 49వ వార్డు కార్పోరేటర్ వి.రాజేశ్వరి, 51వ వార్డు కార్పోరేటర్ కాయల సాహిత్య, 54వ వార్డు కార్పోరేటర్ షేక్ సఫియా బేగం, కో-ఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular