హైదరాబాద్: హైదరాబాద్ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ముట్టడించారు. బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ పర్మనెంట్ వీసీ ను నియమించాలి. విద్యార్థుల సమస్యలు పట్టించుకోని విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయలి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఛలో బాసర కు పిలుపునిస్తామని హెచ్చరించారు. విద్యా శాఖ మంత్రి కార్యాలయం గేటు ముందు ఆందోళన చేస్తున్న ఎస్.ఎఫ్.ఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు.