ఈ ఏడాదికిగాను 128 మందికి కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో 107 మందికి పద్మశ్రీ, నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్కు పద్మ భూషణ్, సీడీఎస్ బిపిన్ రావత్కు పద్మ విభూషణ్ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.