Saturday, April 20, 2024

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి

  • రాహుల్‌గాంధీకి ఉండటానికి ఇల్లు కూడా లేదు
  • బిజెపి డబుల్ ఇంజన్ అంటే ఉన్న అప్పులను డబుల్ చేయడమే…
  • బిజెపి దేశాన్ని నాశనం చేసింది
  • రాముడు లీడర్ కాదు, దేవుడు
  • అప్పులు చేసే ప్రధాని మనకు వద్దు
  • హనుమంతుడి గుడిలో దీపం పెట్టేది కాంగ్రెస్ కార్యకర్తే
  • టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని, ఆయన ప్రధాని అయితే ప్రజలు సుఖ, సంతోషాలతో ఉంటారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ ప్రధాని అయితే అన్ని వస్తువుల ధరలను తగ్గిస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ది రాజా పుట్టుక అని, కానీ, ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదన్నారు. రాహుల్‌గాంధీ ముత్తాత మోతీలాల్ నెహ్రూ ఆయనకున్న లక్షల ఆస్తులను భారత స్వాతంత్య్ర ఉద్యమం కోసం ఇచ్చేశారని, అందుకే రాహుల్ గాంధీకి ఉండటానికి ఇల్లు కూడా లేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి డబుల్ ఇంజన్ అంటే ఉన్న అప్పులను డబుల్ చేయడమేనని, బిజెపి దేశాన్ని నాశనం చేసిందని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముడి పేరు చెప్పి పబ్లిక్‌ను పరేషాన్ చేస్తున్నారని, కాంగ్రెస్‌ను 15 ఎంపి సీట్లలో గెలిపించాలని, దీనికి ప్రజలు సహక రించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. బిజెపి నేతల ఆందోళనలు ఓట్ల దుకాణంలో భాగమేనన్నారు. దేశంలో అన్ని వస్తువుల ధరలు పెరిగి పట్టపగలే చుక్కలు చూస్తున్నామని జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాముడు లీడర్ కాదు, దేవుడని ఆయన అన్నారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశం అప్పు రూ.55 లక్షల కోట్లు అని, మోడీ వచ్చినప్పటి నుంచి కోటి 13 లక్షల కోట్ల అప్పు చేశారని ఆయన ఆరోపించారు.

దేశాన్ని అప్పుల పాలు చేయమని శ్రీ రాముడు కోరుకున్నాడా?
దేశాన్ని అప్పుల పాలు చేయమని శ్రీ రాముడు కోరుకున్నాడా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అప్పులు చేసే ప్రధాని తమకు వద్దని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాముడి పేరు చెప్పి ప్రజలను బిజెపి నేతలు పరేషాన్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాముడిని బిజెపి నేతలు మొక్కినట్టు బిల్డప్ ఇస్తున్నారన్నారు. హనుమంతుడి గుడిలో దీపం పెట్టేది కాంగ్రెస్ కార్యకర్తనేనని ఆయన చెప్పారు. ఏ బిజెపి నాయకుడు గుడిలో దీపం పెట్టడన్నారు. తాము కెమెరా లేకుండా దేవుడిని మొక్కుతామన్నారు. దేవుడితో రాజకీయం చేయొచ్చని బిజెపిని చూస్తే అర్థం అయిందన్నారు.

ఎపిలో కొత్త డ్రామా నడుస్తోంది
2014 సంవత్స రంలో తులం బంగారం రూ.28 వేలు ఉండగా మోడీ నాయకత్వంలో రూ.75 వేలు అయ్యిందన్నారు. మహిళలు ఆలోచన చేయాలని జగ్గారెడ్డి సూచించారు. ఎపిలో రాళ్లతో కొట్టుకుంటున్నారని, ఎపి ప్రజలు కాంగ్రెస్ గురించి ఆలోచన చేయాలన్నారు. ఎపిలో కొత్త డ్రామా నడుస్తోందని ఆయన అన్నారు. ఆయా పార్టీల నేతలను రాళ్లతో కొట్టడం ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. ఎపిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాళ్లతో కొట్టుకునే వ్యవస్థ ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎపిలో స్వయం పాలన వచ్చిందని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడంతోనేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎపి సిఎం మీ దగ్గరే ఉన్నారని, మీ గల్లీల్లోనే తిరుగుతున్నారని ఆయన అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular