అరాచ‌క పాల‌న‌కు వ్య‌తిరేకంగా రాజీనామా

సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది.. కానీ, నేడు కేసిఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తుంది.. దానికి వ్య‌తిరేకంగా రాజీనామా చేస్తున్నాన‌ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే..

ప్రజలు త్మగౌరవం కోరుకున్నారు.. అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామ చేస్తున్నా.. నేను రాజీనామా చేస్తున్న అంటే కేసిఆర్ దిగి వస్తున్నారు.. నా రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారు. తెలంగాణకు కేసిఆర్ నుంచి విముక్తి కల్పిస్తారు. పడుకుంటే లేస్తే మునుగోడు ప్రజలు గుర్తు రావాలి. నన్ను గెలిపించి ప్రజలు పాపం చేశారా? అభివృద్ది కోసం కేసిఆర్ ను కలువలని చూస్తే అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఉప ఎన్నిక పై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఉప ఎన్నిక వస్తోంది? స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరు. నా మునుగోడు ప్రజల పై ఉన్న నమ్మకం తో రాజీనామ చేసి తీర్పు కోరుతున్నా. ధైర్యం లేక‌పోతో నేను ఈ పని చేసే వాడిని కాదు. నా పై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నా కోసం చేసే యుద్ధం కాదు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజల పై ఉంది. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం కోసం, పేదలకు ఇళ్ల కోసం, పెన్షన్ ల కోసం నా రాజీనామా.. నేను రాజీనామ అనగానే గట్టుప్పల్ మండలం వచ్చింది. సీఎం కు సిరిసిల్ల సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతరులు కనిపించడం లేదు.

ప్రాజెక్టులు కట్టొద్దని మేము చెప్పలేదు. లక్ష రుణ మాఫీ ఏమైంది. వరి కొనలేమని చేతులు ఎత్తేశారు. మిషన్ భగీరథలో 25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా? జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారింది. గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ అజయ్ ఉద్యమకారులా? తెలంగాణలో ప్రజా స్వామ్యం లేదు. స్పీకర్ నా రాజీనామ ఆమోదిస్తారు అనుకుంటున్నా.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article