Sunday, March 16, 2025

వయనాడ్‌లో అధిక మెజార్టీ కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచింది సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్

వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఎంపిగా భారీ విజయం సాధించడంపై సిఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ అధిక మెజార్టీతో విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచిందన్నారు. వయనాడ్ ప్రజలు ఈరోజు భారీ మెజారిటీ ఇచ్చి సరికొత్త రికార్డు సృష్టించారన్నారు.

ప్రియాంక గాంధీ భారీ విజయంతో పార్లమెంట్ అరంగేట్రం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వాయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీని అభ్యర్థిగా బరిలోకి దింపింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com