కేకే సలహాలతో రాష్ట్రాన్ని నడిపిస్తాం
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావు కు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం..గురువారం అక్కడున్న కేశవరావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఇకపై కాంగ్రెస్ పార్టీకి,రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలన్నీ కేకే తీసుకుంటారని చెప్పారు. ఆయన సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.