Monday, March 10, 2025

కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి పలు రాష్ట్రాలకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు

  • ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్న మంత్రులు, నాయకులు

తెలంగాణలో పోలింగ్ ముగిసిపోవడంతో వేరే రాష్ట్రాలకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిమిత్తం తరలివెళ్లారు. 40 రోజుల పాటు తెలంగాణలో ప్రచారంలో తలమునకలైన అభ్యర్థులు, పార్టీ లీడర్లలో కొందరు కుటుంబ సభ్యులతో సేదతీరుతుంటే మరికొందరు మాత్రం విహారయాత్రలు బయలుదేరి వెళ్లారు. ఇందులో కొందరు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాత్రం వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరపున ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా టిపిసిసి నేతలు యూపీలోని రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి మద్ధతుగా ప్రచారం చేసేందుకు బయలుదే వెళ్లారు.

సీతక్క, విహెచ్‌లు అక్కడే…
అయితే కాంగ్రెస్‌కు కంచుకోటగా రాయ్‌బరేలీలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాలకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులను అక్కడకు పంపుతోంది. ఈ నేపథ్యంలో దశలవారీగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారానికి బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క, పార్టీ సీనియర్ నేత విహెచ్ రాయ్‌బరేలీలో ఉండగా గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అక్కడకు బయలుదేరారు. మరోవైపు ఏఐసిసి స్టార్ క్యాంపెయినర్ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం రాయ్‌బరేలీతో పాటు మిగతా ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క కూడా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

బిజెపి ప్రయత్నాలకు చెక్ పెట్టాలన్న వ్యూహాంలో…
కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్న రాహుల్ గాంధీ రెండోస్థానం పోటీ విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన అనంతరం అధిష్టానం రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ మొన్నటివరకు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల ఆమె రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని భావించినా బిజెపి దూకుడును నిలువరించాలంటే రాహుల్ గాంధీని పోటీకి దింపడమే సరైన చాయిస్ అనే అభిప్రాయానికి పార్టీ వచ్చింది.

రాహుల్ పోటీ చేయడం ద్వారా రాష్ట్రంలోని ఇతర 16 స్థానాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీని ఓడించేందుకు బిజెపి కూడా గట్టి ప్రయత్నాలనే చేస్తోంది. ప్రత్యర్థిగా బిజెపి తరఫున దినేశ్ ప్రతాప్ సింగ్‌ను బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో బిజెపి ప్రయత్నాలకు చెక్ పెట్టాలన్న వ్యూహాంలో భాగంగా ఏఐసిసి ప్రచార పర్వంలోనూ మరింత జాగ్రత్త పడుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com