Tirumala Covid Restrictions
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నడకదారి భక్తులకు ముందు రోజు ఉదయం 9 గం. ల నుంచి అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే, వాహనాల్లో వచ్చేవారికి ముందు రోజు మధ్యాహ్నం 1 నుంచి అనుమతిస్తామని చెప్పారు.