తిరుమల:తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబరు నెల కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను గురువారం ఉదయం తితిదే ఆన్లైన్లో విడుదల చేసింది. సెప్టెంబర్ మాసానికి సంబంధించి రోజుకు 25వేల చొప్పున టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తితిదే తెలిపింది.