మానుకోటలో కిలాడి లేడి కర్నాటి స్వప్న హల్ చల్

  • మానుకోటలో కిలాడి లేడి కర్నాటి స్వప్న హల్ చల్
    *తొమ్మిదిమందిని వివాహం చేసుకున్న మహిళ
    *తొమ్మిదో భర్త వెంకటేష్ ఠాణా మెట్లెక్కడంతో బయటపడ్డ కిలాడీ లేడి మోసాలు
    *భర్త నే వేధిస్తున్నాడంటూ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన స్వప్న

మహబూబాబాద్: ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకొని….తొమ్మిదో భర్తకు దొరికపోయింది. మహబూబాబాద్ జిల్లా కు చెందిన స్వప్నకు మ్యాట్రి మోనీ సైట్లో ఆంధ్రా అబ్బాయి కి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా పెళ్ళికి దారి తీసింది. ఆ అమ్మాయి తన పెళ్ళి సంబంధం కుదుర్చుకునేందుకు తమ ఇంటిల్లిపాది ని వెంటబెట్టుకుని ఆంధ్రాలోని అబ్బాయి ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నారు. 2018లో పెళ్ళి చేసుకున్న ఈ నవ దంపతులు బెంగళూరు లో రెండు నెలలు మాత్రమే కాపురం చేశారు. ఈ రెండు నెలల కాలంలో ఆ అమ్మాయి తరుచూ ఫోన్లో మాట్లాడుతూ కోర్టు విషయాలలో తలమునకలై ఉండేదని భర్త అంటున్నాడు. ఏంటని భర్త ప్రశ్నిస్తే తనతో గొడవలకు దిగేదని ఆరోపించాడు. ఈ క్రమంలో ఓ రోజు బెంగుళూరు నుంచి ఆకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్ళాలని పట్టుబడిందని, వెళ్ళి వచ్చాకా మళ్ళీ వెళ్ళాలని అనడంతో అనుమానం వచ్చి ఫాలో చేసి ఆరా తీసాడు. దాంతో ఆమె చేసిన తతంగం అంతా బయటపడింది. అక్కడే ఆమెకు సంబంధించిన వివరాలు లాగగా షాక్ కు గురయ్యానని అంటున్నాడు. .ఆమె చేసుకున్న పెళ్ళి తతంగాలు అంతాఇంతా కాదని ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకుని తొమ్మిదో పెళ్ళికి నీను బుక్కాయ్యానని తెలుసుకున్న భర్త తన నుంచి విడాకులు కావాలని కోరాడు. దీంతో ఆ ఖిలాడీ భర్త నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించింది. దీంతో నివ్వెర పోయిన భర్త ఆమె చేసుకున్న వివాహాల గురించి చిట్టా విప్పాడు. ఎప్పుడు ఏ సంవత్సరం లో ఎవరిని పెళ్ళి చేసుకుంది, ఎంత లాగింది……కొందరైతే మరణించిన సందర్భాలున్నాయని ఆధారాలు బయటపెట్టాడు. .

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article