ప్రపంచ క్రికెట్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో తలపడనున్న టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో అజింక్య రహానె వైస్ కెప్టెన్గా మొత్తం 15 మంది సభ్యుల జట్టును ఖరారు చేసింది. వీరిలో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, పుజారా, రిషబ్ పంత్, జడేజా, బుమ్రా, షమీ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, విహారి, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్, అశ్విన్లకు చోటు దక్కింది.