యోగా నిత్య జీవితంలో భాగమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కొంత మంది రోగాలు పడ్డాక యోగా చేద్దామని అనుకుంటున్నారని, అలా కాకుండా నిత్యం యోగా చేయడం వాళ్ళ పూర్తి ఆయుష్తో నిండు నూరేళ్లు బ్రతుకుతారని తెలిపారు. కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని.అన్నింటికి పరిష్కారం యోగా అని చెప్పుకొచ్చారు