దేశవ్యాప్తంగా జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది. 75 నగరాల్లో వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక రాష్ట్రం మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొని ఆసనాలు వేశారు. దేశ రాజధాని ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో సీఎం కేజ్రీవాల్, ఉత్తర్ప్రదేశ్ నోయిడాలో బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, రిషికేశ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పాల్గొన్నారు.