యోగ సాధనం ప్రపంచ శాంతికి మార్గం : మోదీ

దేశవ్యాప్తంగా జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జ‌రుగుతోంది. 75 నగరాల్లో వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక రాష్ట్రం మైసూరులో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన యోగా దినోత్సవ కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పాల్గొని ఆసనాలు వేశారు. దేశ రాజధాని ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో సీఎం​ కేజ్రీవాల్​, ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, రిషికేశ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్​ ధామి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article