అమరావతి : రాష్ట్రంలో మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ సిక్స్లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు.. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది.