Sunday, October 6, 2024

మూడేళ్లలో మూడు ఘట్టాలు… మరువలేను ఈ జ్ఞాపకాలు..

  • పిసిసి అధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిఎం రేవంత్
  • ట్విట్టర్ వేదికగా సోనియా, అగ్రనేతలకు కృతజ్ఞతలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి నేటితో మూడు వసంతాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పేర్కొన్నారు. నాడు తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ఫొటోలు పంచుకున్నారు.

పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించడం, సోనియా గాంధీ సారథ్యంలో విజయభేరి సభ నిర్వహించడం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఈ మూడేళ్లలో ఈ మూడు ఘట్టాలు తన జీవితంలో మరువలేని సందర్భాలని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రస్థానంలో తనకు సహకరించిన పార్టీ సీనియర్ నేతలకు, పార్టీ అధికారంలోకి రావడానికి కఠోర శ్రమ చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు, కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా పాలనకు నాంది పలికిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా సిఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular