Sunday, September 29, 2024

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం

మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండింగ్
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటి మిట్ట దగ్గర వరకు వెళ్లిన తర్వాత విమానంలో సాంకేతిక లోపం కారణంగా మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు.

హైదరాబాద్ నుంచి ఉదయం 6: 35గంటలకు బయలుదేరి
7: 30 గంటలకు తిరుపతి చేరుకోవాల్సి ఉంది. సాంకేతిక లోపం వల్ల తిరిగి 8: 30గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. విమానంలో మొత్తం 66 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతికలోపం తలెత్తినా ప్రమాదమేమీ జరగకపోవటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular