Sunday, October 6, 2024

అమిత్ షాపై కేసు ఉపసంహరణ

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం!

ఎన్నికల ప్రచారం సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. కోడ్ ఉల్లంఘించారన్న అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది. అమిత్ షా తో పాటు కిషన్ రెడ్డిపై సైతం కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. తాజాగా ఆ కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదన్న కారణంతో కేసు ఉపసంహరించుకున్నారు.

చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును వెనక్కి తీసుకున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజులకే తెలంగాణ పోలీసులు ఆయనపై కేసు ఉపసంహరించుకోడం చర్చనీయాంశమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular