Wednesday, June 18, 2025

నిహారిక చేతికి వెడ్డింగ్‌ రింగ్‌

మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన నిహారిక, ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ”కమిటీ కుర్రాళ్లు” సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ”కమిటీ కుర్రాళ్లు” పేరుతో నిహారిక ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. గతేడాది ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ఇదే సమయంలో నిహారిక నిర్మించిన సినిమా పలు అవార్టులను కూడా సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ‘కమిటీ కుర్రాళ్లు”సినిమాను గద్దర్ అవార్డుతో సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద అవార్డు అందుకుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్‌ను నిహారిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నేను కారులో ఒంటరిగా ఉన్నంత వరకు అది నాకు గుర్తులేదు – కానీ ఈ అవార్డు 10 సంవత్సరాల క్రితం ఒక చిన్న నిర్మాణ సంస్థను ప్రారంభించిన అమ్మాయికి ప్రపంచం లాంటిది. ఆమె చూసినట్లు అనిపిస్తుంది. ఇది నిజమైన ప్రారంభంలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు, నా బృందానికి, ఈ చిత్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికీ, నా కుటుంబానికి, నా స్నేహితులకు ధన్యవాదాలు’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ నిహారిక పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నిహారిక చీర కట్టుకుని కనిపించారు. అయితే ఈ సందర్భంగా ఆమె చేతికి కొత్తగా ఉంగరం దర్శనం ఇచ్చింది. నిహారిక కూడా ఆ ఉంగరం హైలెట్ అయ్యేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో నిహారిక రెండో పెళ్లికి సిద్ధమైందని, అందుకు సంబంధించినిదే ఆ ఉంగరం అంటూ ప్రచారం జరుగుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ఆమెకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com