- మేము అలాంటి భూములకు రైతుబంధు ఇవ్వం
- కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంటుంది
- స్పీకర్ పార్మాట్లో హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలి
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బిఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ భూములకు, కొండలు, గుట్టలకు రైతుబంధు ఇచ్చారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి భూములకు రైతుబంధు ఇవ్వదని, తాము మాటకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ఆగష్టు15వ తేదీ లోపు చేసి తీరుతామని ఆయన తెలిపారు. స్పీకర్ పార్మాట్లో హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని, హరీష్రావు చేసిన ఛాలెంజ్కు కట్టుబడి ఉండాలన్నారు.
పక్కకు పారి పోకుండా మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తి అని, ఇప్పటి వరకు 68 లక్షల మంది రైతులకు రూ. 7వేల 6వందల 25కోట్లు రైతు బంధు ప్రభుత్వం ఇచ్చిందన్నారు.
2022, -2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన తేదీలకంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతుబంధును అకౌంట్లో వేసిందన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్ తప్పదని, రైతు భరోసాకు విధి,విధానాలను రూపొందిస్తున్నామన్నారు. ఆలస్యం కాకుండా అనుకున్న సమయంలో రైతు భరోసా ఇస్తామని, ఆరు గ్యారంటీల అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.