Wednesday, March 12, 2025

మా చావుకి ఎవరూ కారణం కాదు…హబ్సిగూడలో దారుణం

ఆర్ధిక ఇబ్బందులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ హబ్సిగూడలో చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (44), కవిత (35) దంపతులు ఏడాది క్రితం హబ్సిగూడకు వచ్చారు. వీరికి విశ్వాన్‌రెడ్డి (10), శ్రీతరెడ్డి(15) సంతానం.

చంద్రశేఖర్‌రెడ్డి కొంతకాలంపాటు ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఈ నేపథ్యంలో నిన్న కుమారుడు విశ్వాన్‌రెడ్డికి విషమిచ్చి, కుమార్తె శ్రీతరెడ్డికి ఉరివేసి చంపేశారు. ఆపై భార్యాభర్తలు ఇద్దరు ఉరివేసుకున్నారు.

తన చావుకి ఎవరూ కారణం కాదని, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించాలంటూ చంద్రశేఖర్‌రెడ్డి రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కెరీర్‌లోనూ, శారీరకంగా, మానసింగా సమస్యలు ఎదుర్కొంటున్నానని, షుగర్, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు చంద్రశేఖర్‌రెడ్డి అందులో పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com