Sunday, June 1, 2025

వారంలోనే వందమందికి కోవిడ్‌ పాజిటివ్‌

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. వారం రోజుల్లో నగరంలో వందకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ మళ్లీ పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరినట్లు కేంద్ర కొవిడ్-19 సమాచార నివేదిక వెల్లడించింది. ఒక్క ఢిల్లీలోనే 104 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 99 కేసులు గత వారం రోజుల్లోనే నమోదవడం గమనార్హం. రాష్ట్రాల వారీగా కేరళలో 430 మంది, మహారాష్ట్రలో 209 మంది, ఢిల్లీలో 104 మంది కొవిడ్ బాధితులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 చొప్పున యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొవిడ్ కారణంగా మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com