ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాల్లో ఓ విద్యార్థి ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మారాడు. ఆ విద్యార్థి వయస్సు 15 ఏళ్లు. కానీ, ఊహించని ఎత్తు పెరిగాడు. ఆ ఎత్తే ఇప్పుడు తనకు గుర్తింపు తెస్తుంది. ఆదిలాబాద్ పట్టణం బొక్కలగూడ కాలనీకి చెందిన వినోద్-సుజాత దంపతుల పెద్ద కుమారుడు వన్నెల హేమంత్. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఆరడుగుల ఎనిమిది అంగుళాల పొడవుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాధారణంగా 14-15ఏళ్ల వయస్సులో అబ్బాయిలు 5 నుంచి 5.7అడుగులు ఉంటారు. కానీ హేమంత్ మాత్రం అనూహ్యంగా పెరిగాడు. తోటి విద్యార్థుల మధ్య హేమంత్ ఓ స్తంభంలో ఉంటున్నాడు.
కాగా, ఈ విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే స్కూల్ యూనిఫాం సరిపోవడం లేదు. ఫలితంగా సివిల్ డ్రెస్లోనే బడికి వస్తున్నాడు. అంతేకాదు.. బడిలో, ఇంటిపక్కన సజ్జల పైన ఏదైనా వస్తువుంటే తననే పిలుస్తారని హేమంత్ చెబుతున్నాడు. స్కూల్ యూనిఫాం సరిపోకపోవడంతో సివిల్ డ్రైస్లోనే వస్తున్నట్లుగా తెలిపాడు. కాళ్లు పొడవుగా ఉండటం వల్ల సైకిల్ తొక్కడం కష్టంగా ఉందని హేమంత్ అన్నాడు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తోందని అంటున్నాడు. బాగా చదివితే పోలీస్గా ఉద్యోగం వస్తుందని టీచర్లు ప్రోత్సహిస్తున్నట్లుగా హేమంత్ వివరించారు.