Friday, September 20, 2024

బాలికను గర్భవతి చేసిన ముగ్గురు యువకులు

ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారం

అభంశుభం తెలియని 9వ తరగతి అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కుటుంబ పెద్ద లేదని అమ్మాయిపై కన్నేశారు కామాంధులు. తల్లి పనికి వెళ్లగా బాలిక ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నారు. అదే అదునుగా తీసుకున్నారు ముగ్గురు యువకులు. బడికి వెళ్తూ, ఆడుకుంటూ సాఫీగా సాగిపోతున్న ఆ బాలికను లోబరుచుకోవాలనుకున్నారు. తల్లి లేని సమయంలో అమ్మాయికి లేనిపోని మాటలు చెప్పారు.

అలా అమ్మాయిని నమ్మించిన ముగ్గురు యువకులు ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడి గర్బవతిని చేశారు. ఈ దుర్ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

కుమార్తెను చదివించడానికి కూలీ పని
సిద్దిపేట గ్రామానికి చెందిన 9వ తరగతి బాలిక తండ్రి అనారోగ్యంతో కొంతకాలం క్రితం మరణించాడు. ఈ ఘటనతో ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లింది ఆ కుటుంబం. తన పరిస్థితిలా తన కుమార్తె జీవితం ఆగంకూడదని భావించిన తల్లి, అన్ని తానై వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఎన్ని సమస్యలు ఎదురైనా పనికి వెళ్తూ కుమార్తెను పాఠశాలకు పంపించేది.

ఆసరాగా తీసుకున్న దుర్మార్గులు
తల్లి పనులకు వెళ్లగా కుమార్తె బడి నుంచి వచ్చాక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. దీన్నే ఆసరాగా తీసుకున్నారు ముగ్గురు దుర్మార్గులు. అవకాశం దొరికినప్పుడల్లా అమ్మాయికి మాటమాటలు చెప్పారు. అలా ఆ అమ్మాయి వీళ్లు చెప్పిన మాటలు నమ్మిందని తెలుసుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డారు. వేరువేరు సందర్భాల్లో ఒకరికి తెలవకుండా మరొకరు ఒంటరిగా ఉందని తెలుసుకుని లోబరుచుకున్నారు.

కడుపు నొప్పితో బయటపడిన నిజం
ఇటీవల అమ్మాయి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. దీంతో చికిత్స నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అమ్మాయి గర్భవతని వెల్లడించారు. ఈ విషయంపై బాలికను తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో బాధితురాలు తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఆ ముగ్గురు వ్యక్తులను విచారించగా తామే అత్యాచారం చేసినట్లు అంగీకరించారు. ముగ్గురి నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos