Wednesday, September 18, 2024

అంబానీ పెళ్లికి వెళ్లిన ఆంధ్రా యువకులు అరెస్ట్ 

* అంబానీ పెళ్లికి వెళ్లిన ఆంధ్రా యువకులు అరెస్ట్ 
* ఆహ్వానం లేకుండా వెళ్లి పోలీసులకు చిక్కిన వైనం

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికల వివాహ వేడుక ముంబయిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి దేశ విదేశాల నుంచి అతిరధ మహారధులు విచ్చేసి సందడి చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అంబానీ ఇంట పెళ్లి వేడుక గురించే చెప్పుకుంటున్నారు. ఐతే వివాహానికి ఆహ్వానం లేకుండా హాజరైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ఇలా ఇన్విటేషన్ లేకుండా అంబాని ఇంటి పెళ్లికి వెళ్లిన ఇద్దరు యువ ఆంధ్రప్రదేశ్‌ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అందులో ఒకరు యూట్యూబర్‌ వెంకటేశ్‌ అల్లూరి, మరొకరు వ్యాపారవేత్తగా చెప్పుకొంటున్న షఫీ షేక్‌గా నిర్ధారించారు ముంబయి పోలీసులు. వారిద్దరిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించిన తరువాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. ముంబయిలోనే అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు.. తదుపరి విచారణకు రావాలని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ ఇద్దరు తెలుగు యువకులు భద్రతా వలయాన్ని దాటుకుని వివాహం జరుగుతున్న వేదిక ప్రధాన ద్వారం వరకు వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఐతే అనుమానం వచ్చిన భద్రతా బలగాలు వారిని తనిఖీ చేయగా వారిద్దరికి అసలు పెళ్లికి ఆహ్వానమే లేదని గుర్తించారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు వారిద్దరిని అప్పగించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular