Monday, April 21, 2025

20 మంది ఐపీఎస్ అధికారుల బ‌దిలీ

రాష్టంలో 20 మంది ఐపీఎస్ అధికారులను ప్ర‌భుత్వం బదిలీ చేసింది. డిజిపిగా రవిగుప్తకు పూర్తిస్థాయి బాధ్యతను అప్ప‌గించారు. మాజీ డిజిపి అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డిజిగా బదిలీ చేయ‌గా.. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీబీ డిజిగా నియ‌మించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్, అభిలాష్ బిస్తాను అడిషనల్ డిజి తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ అయ్యారు. సౌమ్య మిశ్రాను జైళ్ళ శాఖ అడిషనల్ డిజిగా, ఉమెన్స్ సేఫ్టీలో ఉన్న షికా గోయల్ సిఐడి అడిషనల్ డిజిగా బదిలీ చేశారు. సిఐడి చీఫ్ గా ఉన్న మహేష్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డిజిగా బదిలీ కాగా ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డిజిగా నియ‌మించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com