తిరుపతి, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల కారణంగా నష్టపోయిన విజయవాడ తదితర ప్రాంతాల వరద బాధితుల సహాయార్థం ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్(ECL) కంపెనీ, శ్రీకాళహస్తి తరపున ఎండీ సురేష్ ఖండేల్వాల్ 25 లక్షల రూపాయల చెక్కును విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి గౌ. ఆం.ప్ర రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,ఆర్టీజీ, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి రేణిగుంట విమానాశ్రయం నందు శ్రీకాళహస్తి ఎంఎల్ఎ బొజ్జల సుధీర్ రెడ్డి తో కలిసి అందచేశారు.