Sunday, April 20, 2025

తమిళనాడులో కల్తీ సారా ఘటనలో 25 మంది మృతి

* తమిళనాడులో కల్తీ సారా ఘటనలో 25 మంది మృతి
* కలెక్టర్, ఎస్పీపై వేటు వేసిన సీఎం స్టాలిన్
తమిళనాడులో విషాధకర ఘటన చోటుచేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లాలో నాటు సారా తాగిన సంఘటనలో మృతుల సంఖ్య 25 కు చేరింది. స్థానిక కరుణాపురంలో మంగళవారం పలువురు నాటు సారా తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో 25 మంది చనిపోగా మరో 60 మంది బాధితులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కళ్లకురిచ్చి నాటుసారా ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లకురిచి జిల్లా కలెక్టర్‌ పై బదిలీ వేటు వేయడంతో పాటు ఎస్పీని సస్పెండ్‌ చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం స్టాలిన్. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com