భారీ ఆఫర్ ప్రకటించిన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్
భారత టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రంలో హుబ్బళ్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేయడానికి ముందుకు వచ్చిన ఉద్యోగులకు 8 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకం ఇస్తామని పేర్కొంది. ఈ క్రమంలో ఉద్యోగులకు ఇటీవల ఈమెయిల్ ద్వారా ఈ ఆఫర్ కు సంబందించిన వివరాలను తెలపింది ఇన్పోసిస్. అభివృద్ధి చెందడానికి మెరుగైన అవకాశాలున్న హుబ్బళ్లిలో పనిచేసే ప్రతిభావంతుల కోసం వేచి చూస్తున్నామని ఈ సందర్బంగా పేర్కొంది.
సంస్థకు చెందిన ప్రాజెక్టు డెవలప్మెంట్ విధుల్లో ఉన్న బ్యాండ్-2, ఆ పైస్థాయి ఉద్యోగులకు బదిలీ ప్రోత్సాహకాలు అందిస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. దేశంలోని ఏ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ నుంచైనా ఉద్యోగులు ఇక్కడికి రావొచ్చని తెలిపింది. బ్యాండ్ 3, అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులకు బదిలీ సమయంలో 25 వేల రూపాయలు అందిస్తామని పేర్కొంది.
ఆ తర్వాత ప్రతీ ఆరు నెలలకు 25 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. మొత్తానికి హుబ్బెళ్లికి ఇలా ఇతర బ్రాంచీల నుంచి వచ్చి వేరా 1.25 లక్షల ప్రోత్సాహకాలు అందుకోనున్నారన్న మాట. ఇదే క్రమంలో బ్యాండ్ 4 ఉద్యోగులకు 2.5 లక్షలు, బ్యాండ్ 5 ఉద్యోగులు 5 లక్షలు, బ్యాండ్ 6 స్థాయి ఉద్యోగులకు మొత్తం 8 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొంది ఇన్ఫోసిస్.