- ఇకనుంచి ఆ సర్టిఫికెట్లు ఆన్ లైన్ లోనే జారీ
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మీ సేవ’ లో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇన్నాళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో మాన్యువల్గా అందిస్తున్న సేవలను ఆన్ లైన్లో అందుబాటు లోకి తెస్తున్నట్టు సీసీఎల్ఏ కార్యాలయం ప్రకటించింది.
కొత్తగా.. గ్యాప్ సర్టిఫికెట్, పౌరుల పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికెట్, మరోసారి సర్టిఫికెట్ల జారీ (రీ ఇష్యూ), క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు, మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ, పాత రికార్డుల కాపీలు (ఖాస్రా/సెస్సాలా పహాణీ), 1బీ సర్టిఫైడ్ కాపీలు ఇకపై ఆన్ లైన్లో మీసేవ ద్వారా అందజేయ నున్నారు.