ఐఏఎస్ (2022, శిక్షణలో ఉన్న) బ్యాచ్కు చెందిన ఏడుగురిని సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్లోని కాగజ్నగర్ సబ్ కలెక్టర్గా శారదశుక్లాను, కామారెడ్డి జిల్లా బాన్సువాడకు కిరణ్మయి కొప్పిశెట్టిని, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు నారాయణ అమిత్ను, నిజామాబాద్ జిల్లా బోధన్కు వికాస్ మహాతోను, వికారాబాద్ జిల్లా తాండూర్కు ఉమాశంకర్ ప్రసాద్ను, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకు మయాంక్ సింగ్ను, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు యువరాజ్ మర్మత్లను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.