ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన బల్లి కనిపించింది. తిరుమల తిరుపతి శేషాచలం అడవుల్లో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లిని గుర్తించారు. గురువారం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లకు ఈ బంగారు బల్లి కనిపించింది. ఏపీ అటవీశాఖ షెడ్యూల్-1 కింద పరిగణిస్తున్న బంగారు బల్లి చీకటి ప్రదేశాల్లో, రాతిబండల్లో నివసిస్తుంది. పసిడి వర్ణంలో మెరిసిపోయే ఈ బల్లుల జాడ ఈ మధ్య కాలంలో లేకుండా పోయిందని జంతుశాష్ట్ర నిపుణులు చెబుతున్నారు. తాజాగా కల్యాణిడ్యాం పరిధిలో ఈ బంగారు బల్లిని గుర్తించారు. జంతుశాస్త్రంలో ఈ బల్లిని గోల్డెన్ గెకో గా పిలుస్తారు. చాలా యేళ్ల తరువాత బంగారు బల్లి కనిపించిందని, శేషాచలం అడవుల్లో బంగారు బల్లులు ఇంకా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బంగారు బల్లిని చూస్తే శుభం కలుగుతుందని కొంత మంది నమ్ముతారు.